సూర్యాపేట: రేపు హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. దీనికోసం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో భారీ బందోబస్తు నడుమ కౌంటింగ్కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుండగా ఆ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. మొత్తం 22 రౌండ్లలో ఈవీఎంల లెక్కింపు నిర్వహించనున్నారు. ఒక్కో రౌండ్కు 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా ఒక్కో టేబుల్కు మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు. మధ్యాహ్నాం 2గంటల లోపే ఫలితంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
