విశాఖపట్నం: జీఎస్టీ నకిలీ ఇన్వాయిస్ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం సంచాలకుడు మయాంక్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టులు, మౌలిక సదుపాయాల నిర్మాణ రంగానికి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కంపెనీ పేరిట ఎటువంటి సేవలు అందించకుండానే రూ.450 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్లను విడుదల చేసినట్టు మయాంక్ శర్మ పేర్కొన్నారు.
