కడప: చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్కు ఊరట లభించింది. బాధితులతో బండ్ల గణేష్ తరఫు న్యాయవాది చేసిన రాజీ ప్రయత్నాలు ఫలించాయి. బాకీ సొమ్ములో ప్రస్తుతం బండ్ల గణేష్ రూ.4లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని వచ్చే నెల 14న చెల్లించేలా ఒప్పందం కుదర్చుకున్నారు. ఈ నేపథ్యంలో గణేష్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో కడప మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. బండ్ల గణేష్పై కడపలో, ప్రొద్దుటూరులో చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి. నిన్న సాయంత్రం బండ్ల గణేశ్ సినీఫక్కీలో అరెస్టయ్యారు.
