కాలిఫోర్నియా: ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ షాడ్ గ్యాస్పార్డ్(39) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మే 17వ తేదీన తన కుమారుడితో కలిసి కాలిఫోర్నియాలోని వెనిస్ బీచ్కు సరదగా ఈతకు వెళ్లిన అతను అలల తాకిడికి తట్టుకోలేక కొట్టుకుపోయాడు. అక్కడ ఉన్న లైఫ్గార్డులు అతని కుమారుడిని ప్రమాదం నుంచి కాపాడారు. సముద్ర తీరం నుండి 50 గజాల దూరంలో గ్యాస్పార్డ్ ఉండటంతో ఏం చేయలేకపోయామని పోలీసులు తెలిపారు. ఇక గ్యాస్పార్డ్ మృతి పట్ల డబ్ల్యూడబ్ల్యూఈ …
Read More »మా దేశంలో IPL నిర్వహించండి
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడారంగం పూర్తిగా స్తంభించిపోగా.. ఒలింపిక్స్, టెన్నిస్ గ్రాండ్స్లామ్స్ సహా పలు టోర్నీలు వాయిదా పడ్డాయి. ఇదే సమయంలో ఐపీఎల్ కూడా వాయిదా పడగా.. శ్రీలంక బోర్డు BCCIకి ఓ ప్రతిపాదన చేసింది. ‘మా దేశంలో కరోనా ప్రభావం లేదు. మా దేశంలో IPL నిర్వహించండి. BCCIకి ఈ ప్రతిపాదన నచ్చితే.. ప్లేయర్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’ అని లంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మి …
Read More »‘నా కెరీర్లో ఆ స్పెల్ ఎప్పటికి మరిచిపోను’
1999లో పాకిస్తాన్ పేసర్ షోయబ్ అక్తర్ అత్యంత వేగంగా బంతులు విసిరిన స్పెల్గా తనకు ఎప్పటికి గుర్తుండిపోతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. 1999లో పాక్ జట్టు తమ దేశంలో పర్యటించింది. కాగా పెర్త్లో జరిగిన టెస్టు మ్యాచ్లో అక్తర్ ఒక ఓవర్లో ప్రతీ బాల్ను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో విసిరాడని గుర్తుచేశాడు. కాగా అంతకుముందు ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనకు వేసిన …
Read More »భారత్–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్పై లయన్ వ్యాఖ్య
సిడ్నీ: విరాట్ కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 టెస్టు సిరీస్ను 2–1తో సొంతం చేసుకొని ఈ ఘనత సాధించిన తొలి భారత జట్టుగా నిలిచింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో కూడా నాలుగు టెస్టుల సిరీస్ కోసం భారత్ మళ్లీ పర్యటించాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో సిరీస్ జరుగుతుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. అవసరమైతే ప్రేక్షకులు లేకుండానైనా దీనిని నిర్వహించాలని ఆస్ట్రేలియా క్రికెట్ …
Read More »ఐపీఎల్ జరగకపోతే ధోనీకి కష్టమే…
ఐపీఎల్ జరగకుంటే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమవుతుందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ధోనీ ఐపీఎల్లో రాణిస్తే టీ20 ప్రపంచకప్కు ఎంపికయ్యే అవకాశం ఉండేదని, కానీ కరోనా వల్ల ఐపీఎల్ జరిగే అవకాశం లేకపోవడంతో ధోనీకి చాలా కష్టమవుతుందన్నాడు. ధోనీ స్థానాన్ని కేఎల్ రాహుల్తో భర్తీ చేస్తే బాగుంటుందన్నాడు. రిటైర్మెంట్ అనేది ధోనీ ఇష్టమని గంభీర్ చెప్పాడు.
Read More »ఐపీఎల్ నిరవధికంగా వాయిదా?…
కరోనా వైరస్ ప్రభావం, లాక్డౌన్ నేపథ్యంలో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడనుందని సమాచారం. ఇవాళ దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రానుందని తెలుస్తోంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇవాళ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఐపీఎల్ నిర్వహణపై చర్చించనుంది. అయితే ఈ నెల 30వరకు లాక్డౌన్ ఉండటం, ఆ తర్వాత కూడా కరోనా ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో ఈ ఏడాది ఐపీఎల్ను వాయిదా వేయనున్నారని తెలుస్తోంది.
Read More »5వేల కుటుంబాలకు సచిన్ సాయం..
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 5వేల కుటుంబాలకు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అండగా నిలుస్తున్నాడు. ముంబైలోని శివాజీనగర్, గోవండీ ప్రాంతాల్లో ఉన్న 5వేల పేద కుటుంబాలకు నెలకు సరిపడా సరుకులను అప్నల్యా అనే సంస్థ సాయంతో అందజేశాడు. ఎంతోమంది పేదలు ఇబ్బంది పడుతున్నారని.. అలాంటి వారికి సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని సచిన్ పిలుపునిచ్చాడు.
Read More »ఐపీఎల్ వాయిదా కలిసొచ్చింది…
చెన్నై: కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడటం తనకి కలిసొచ్చిందని టీమ్ఇండియా పేసర్ దీపక్ చాహర్ అన్నాడు. ఈ సమయంలో వెన్ను గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని తెలిపాడు. ”గాయం నుంచి కోలుకుని మళ్లీ బౌలింగ్ చేయడానికి ఎదురుచూస్తున్నా. ప్రస్తుతానికి నా దృష్టి అంతా ఫిట్నెస్పై ఉంది. ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవడంలో కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. అయితే గాయం నుంచి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. షెడ్యూల్ ప్రకారమే …
Read More »జాక్ ఎడ్వర్డ్స్ కన్నుమూత…
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జాక్ ఎడ్వర్డ్స్(64) కన్నుమూశారు. ఆయన మరణాన్ని ఆ దేశ సెంట్రల్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ ధృవీకరించింది. అయితే ఆయన మృతికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. 1974-85 మధ్య కాలంలో క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. 64 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 6 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడింది కేవలం నాలుగేళ్లే అయినా తన ఆటతో బిగ్ హిట్టర్గా ఎడ్వర్డ్స్ పేరు …
Read More »పీఎం కేర్స్ ఫండ్ కు గౌతమ్ గంభీర్ విరాళం
న్యూఢిల్లీ: కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడేందుకు భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి గౌతమ్ గంభీర్ తన రెండేళ్ల జీతాన్ని ప్రధాని రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చారు. కోవిడ్ -19 మహమ్మారిపై ప్రపంచం పోరాడుతోంది. భారతదేశంలో 1900 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడగా, 50 మంది మరణించారు. గంభీర్ ట్విట్టర్లో… దేశం మన కోసం ఏమి చేసిందని చాలామంది అడుగుతారు. …
Read More »