శ్రీశైలం ఆలయం క్యూ లైన్లలో నాగుపాము ప్రత్యక్షమైంది. కొంతసేపు పగడవిప్పి భక్తులను చూస్తూ కనువిందు చేసింది. పామును చూసిన భక్తులు భయాందోళనకు గురై ఆ తర్వాత ఆశ్చర్యానికి గురయ్యారు. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు.. అందులోనూ నాగుపాము శివాలయంలోని మల్లికార్జునస్వామి ఆలయం క్యూ లైన్లలో భక్తులకు దర్శనమివ్వడంతో వారు పునీతులయ్యారు. శివుడి కంఠస్థలంలో ఉండే నాగేంద్రుడు శివాలయంలోని క్యూ లైన్లలో దర్శనమివ్వడం మంచి పరిణామంగా భావించిన భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. …
Read More »ఐదేళ్ల చిన్నారిపై దాడి చేసి చంపిన వీధి కుక్కలు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో హృదయ విదారకర ఘటన జరిగింది. పట్టణంలోని పోలీస్ లైన్ వీధిలో.. వీధి కుక్కలు దాడి చేసి ఐదేళ్ల చిన్నారి నరసింహను పొట్టనబెట్టుకున్నాయి. బాబు మృతితో.. తల్లి కన్నీరుమున్నీరవుతోంది. వీధి కుక్కలు దాడి జరిగినప్పటి దృశ్యాలు.. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కుక్కలు అత్యంత దారుణంగా బాలుడి వెంటబడి తరుముతూ దాడి చేయడంతో చూసేవారిని కంటతడిపెట్టిస్తోంది. శునకాలు వేగంగా వెంటాడినపుడు.. ప్రాణాలు దక్కించుకోవడానికి ఐదేళ్ల నర్సింహ తీవ్రంగా …
Read More »అహోబిలంలో చిరుత సంచారం
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం దుర్గమ్మ ఆలయం సమీపంలో ఓ చిరుతపులి రోడ్డుపై కనిపించడం కలకలం సృష్టించింది. అహోబిలం పుణ్యక్షేత్రంలో దట్టమైన అడవులు, ఎత్తైన కొండలున్నాయి. ఇక అడవుల్లోంచి బయటకు వచ్చిన చిరుత రోడ్డుపై సేదతీరుతూ వాహనదారులకు కనిపించింది. కొన్ని క్షణాల పాటు వాహనాలకు దారి ఇవ్వకుండా అట్లాగే రోడ్డేపై కూర్చుండిపోయింది. వాహనంలో ఉన్న వాళ్లందరూ భయంతో వణుకుతూ అలాగే ఉండిపోయారు. వాహనం లైట్లు కూడా ఆర్పకుండా అలాగే …
Read More »మల్లన్న దేవస్థానం కుంభకోణాన్ని ఛేదించిన పోలీసులు
శ్రీశైలం మల్లన్న సన్నిధిలో రూ. 2.12 కోట్ల మేరకు జరిగిన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలో… 27 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా ఈ మోసాలు జరిగినట్లు నిర్ధారించారు. ఈ కుంభకోణంలో నిందితులపై నాలుగు కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇప్పటివరకు రూ. 83.40 లక్షలు రికవరీ చేశారు. కాగా, నిందితుల్లో కొందరిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.
Read More »కర్నూలులో 722కు చేరిన కరోనా కేసులు…
కర్నూలు: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రధానంగా కర్నూలు జిల్లాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 722కు చేరింది. కరోనా నుంచి కోలుకుని 616 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 106 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కరోనా బారిన పడి 25 మంది మృతి చెందారు.
Read More »ఆస్పత్రి నుంచి కరోనా రోగి అదృశ్యం…
కర్నూలు: కర్నూలు జిల్లా ప్రభుత్వాసుపత్రి నుంచి కరోనా రోగి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న 60 ఏళ్ల వృద్ధురాలు కనిపించకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కర్నూలు బస్టాండు, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ వృద్ధురాలు ఆదోని వెళ్లే బస్సు ఎక్కినట్లు సమాచారం అందడంతో పోలీసులు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు.
Read More »రంజాన్ శుభాకాంక్షలు
ఇంట్లోనే జరుపుకోవాలి: కలెక్టర్ విజ్ఞప్తి కర్నూలు: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా జిల్లాలోని ముస్లింలకు జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. లాక్డౌన్ నిబంధనల ప్రకారం ఇంట్లోనే రంజాన్ పార్థనలు చేసుకోవాలని కలెక్టర్ జి. వీరపాండియన్ విజ్ఞప్తి చేశారు. డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ డా. ఫకీరప్ప, జేసీలు రవిపట్టన్ శెట్టి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్ శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు (అర్బన్): …
Read More »ఒకేరోజు 21మందికి కరోనా
ఒకేరోజు 21మందికి కరోనా జిల్లాలో మరొకరి మృత్యువాత రాష్ట్రంలో మరో 68 కొత్త కేసులు మొత్తం 2407కు చేరిన పాజిటివ్లు కోయంబేడు లింకుతో మరో పదిమందికి వైరస్ కరోనా మహమ్మారి తీవ్రతకు కర్నూలు విలవిల్లాడుతోంది. బుధవారం ఒక్కరోజే ఈ జిల్లాలో 21మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 638కి చేరింది. ఈ వ్యాధికి చికిత్స పొందుతూ జిల్లాలో మరొకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా …
Read More »ఎమ్మిగనూరులో తొలి కరోనా కేసు…
కర్నూలు: కర్నూలులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలోని ఎమ్మిగనూరులో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఎన్టీఆర్ కాలనీలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కౌతాళం మండలంలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది.
Read More »కర్నూలులో కేంద్ర బృందం పర్యటన..
కర్నూలు: కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను సమీక్షించేందుకు వచ్చిన కేంద్ర ప్రత్యేక బృందం పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న కర్నూలు జిల్లాలో బృందం సోమవారం పర్యటించింది. ఈ సందర్భంగా జిల్లాలో కొవిడ్ నియంత్రణకు చేపట్టిన చర్యలపై స్థానిక అధికారులతో సమావేశమైంది. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పాలనాధికారి వీర పాండియన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో తాజా …
Read More »