పట్నా: బీహార్ మరోమారు పూర్తిస్థాయి లాక్డౌన్ కోసం సిద్ధమవుతోంది. ఇందుకోసం నితీష్ ప్రభుత్వం ఈరోజు ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల కట్టడి గురించి సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా బీహార్ ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి లాక్డౌన్ విధించే దిశగా ఆలోచిస్తున్నదని అన్నారు. బీహార్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో కొత్తగా 1,116 కరోనా …
Read More »విశాఖ ఫార్మాసిటీలో పేలుడుపై ఏపీ మంత్రి ఆరా
విశాఖపట్నం ఫార్మాసిటీలో పేలుడుపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్లో పేలుడుకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. జిల్లా అధికార యంత్రాంగంతో ఫోన్ ద్వారా ప్రాథమిక సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. భారీ ఎత్తున మంటలు వ్యాపిస్తున్న తరుణంలో ముందు స్థానిక ప్రజలను, ఫార్మాసిటీ పరిధిలో రాత్రి విధుల్లో ఉన్నవారిని రక్షించడానికి కృషి చేయాలని సూచించారు. ఎవరికీ ప్రాణ నష్టం లేకుండా చూడాలని …
Read More »మరో రెండ్రోజులు విస్తారంగా వర్షాలు
విశాఖ దక్షిణ: దక్షిణ భారత ద్వీపకల్ప ప్రాంతంపై ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం చురుగ్గా ఉంది. ఆంధ్రప్రదేశ్పై గాలి విలోమ ప్రభావం తక్కువ స్థాయిలో ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ దృష్ట్యా రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళ, బుధవారాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే …
Read More »విశాఖలో భారీ అగ్నిప్రమాదం
విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడలోని ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాంకీ సాల్వెంట్స్ ఫార్మాలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. 17 సార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని సమాచారం. దాంతో పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. పొగలో 65 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన …
Read More »విశాఖలో కరోనా కేసుల్లో కొత్త రికార్డు.. ఒక్క రోజులోనే..
ఒక్క రోజులోనే 144 కరోనా కేసులు జిల్లాలో 1,807కు చేరిన పాజిటివ్లు జీవీఎంసీ 98వ వార్డులో 15 మందికి వైరస్ ఆలయాల్లో 12 మంది ఉద్యోగులకు…. గోపాలపట్నంలో 8, అల్లిపురంలో 4, వెంకోజీపాలెంలో 3 కేసులు చికిత్స పొందుతూ మరో ఇద్దరి మృతి 15కు చేరిన కొవిడ్ మరణాలు విశాఖపట్నం: జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి కరాళనృత్యం చేస్తున్నది. రోజూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం 144 మందికి …
Read More »విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్ట్
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ సీఈవో సున్కి జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ పీపీసీ మోహన్రావులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కొందరు డైరెక్టర్లు, స్టైరిన్ మోనోమార్ ఇంజినీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ 304(2),278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గ్యాస్ లీకేజీ …
Read More »సీఎం జగన్ కీలక నిర్ణయం.. ?
సీఎం జగన్ ఐటీ రంగంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ కల్పన, ప్రాంతాల మధ్య సమతుల్యత, పర్యావరణ సానుకూల అభివృద్ధి కేంద్రంగా నూతన పారిశ్రామిక విధానం రూపొందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 2020-23 పారిశ్రామిక విధానంపై అధికారుతో సమీక్షించారు. ఈ సమీక్షలో భాగంగానే సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో ఉన్నత శ్రేణి నైపుణ్య వర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం జగన్ …
Read More »ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తే చర్యలు
ప్రైవేటు పాఠశాలలకు డీఈవో హెచ్చరిక విశాఖపట్నం: విద్యాసంవత్సరం ప్రారంభానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు వెలువడలేదని జిల్లా విద్యాశాఖాధికారి బి. లింగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థలు పాఠశాలలు తెరిచి ప్రవేశాలు జరపడం, ఆన్లైన్లో తరగతులు, పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై తల్లిదండ్రులు, ఇతరులు సంబంధిత ఎంఈవో, డీఈవోకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు.
Read More »విశాఖలో మళ్లీ విషవాయువు కలకలం
విశాఖ: ఎల్జి పాలిమర్స్ ఘటన మరువకముందే విశాఖ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్లో విషవాయువు లీక్ అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. కంపెనీలో షిఫ్ట్ ఇన్ చార్జ్ రాగి నాయుడు, కెమిస్ట్ గౌరీశంకర్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. పరవాడలోని ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, …
Read More »నేడూ రేపు వర్షాలే
ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఉత్తరమధ్య కర్ణాటక పరిసరాల్లోనూ ఉపరితల ఆవర్తనం నెలకొంది. వీటి ప్రభావంతో ఆదివారం శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడ్డాయి. జి.సిగడంలో 90.5, ముమ్మడివరంలో 63, తలుపులలో 61.5, పిడుగురాళ్ల లో 59.75, చల్లపల్లిలో 49.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు, దక్షిణకోస్తాలో ఓ మోస్తరు …
Read More »