న్యూఢిల్లీ : భారత్, చైనా, పాకిస్తాన్ దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలని చైనా ఆకాంక్షించింది. చైనా, భారత్లు అత్యంత ప్రభావం కలిగిన పెద్ద దేశాలని చైనా రాయబారి సూన్ వీడాంగ్ అన్నారు. ఇద్దరు నేతలు (చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధాని మోడీ) ఆయా దేశాల పరిస్థితులపై ఎంతో లోతైన అవగాహన కలిగిన వారన్నారు. చైనా, భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాలని చైనా కోరుకుంటున్నదని ఆయన తెలిపారు. ఆ మూడు దేశాలు ఆయా దేశాల అభివృద్ధికి, పురోగతికి, సుస్థిరతకు, శాంతికి కలిసికట్టుగా పని చేస్తాయని తాము ఆశిస్తున్నామని వీడాంగ్ చెప్పారు.
