తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటిస్తున్నారు. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, ఆసుపత్రి ఆవరణలో వైద్య కళాశాలకు ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలిస్తారు. ఆ తర్వాత వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
