అమరావతి: ఏపీఎస్ఆర్టీసీలో 7,600 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తప్పుబట్టారు. లాక్డౌన్ కాలంలో ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించవద్దని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఆర్టీసీ యాజమాన్యం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. గత కొంతకాలంగా ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 7,800 పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. తక్షణం ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
