* క్యూలో 50 మంది వెనుక కేజ్రీవాల్.. ఉత్కంఠ
ఢిల్లీ : మరికాసేపట్లో.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం ముగుస్తుంది. (నిన్న) సోమవారం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భారీ రోడ్ షో కారణంగా నిర్ణీత సమయానికి నామినేషన్ దాఖలు చేయాల్సిన కార్యాలయానికి చేరుకోలేకపోవడంతో వెనక్కి వెళ్లారు. మంగళవారం కూడా కేజ్రీవాల్కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఈ రోజు నామినేషన్ వేయడానికి వచ్చిన కేజ్రీవాల్ క్యూలో నిలబడ్డారు. ఆయన ముందు దాదాపు 50 మంది స్వతంత్ర అభ్యర్థులు క్యూలో ఉండడం గమనార్హం. నామినేషన్ వేసేందుకు కార్యాలయానికి కేజ్రివాల్ తన తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. కేజ్రీవాల్ను స్వతంత్ర అభ్యర్థులు ముందుకు వెళ్లనివ్వడంలేదు. తమలాగే క్యూలో నిలబడాల్సిందేనని అంటున్నారు. మధ్యాహ్నం మూడు గంటల్లోపు అభ్యర్థులు నామినేషన్ వేయాల్సి ఉంటుంది.