ముంబై: రిజర్వ్బ్యాంకు ఆఫ్ ఇండియా మరో రెండు బ్యాంకులపై భారీ జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లఘించిన కారణంగా లక్ష్మి విలాస్ బ్యాంకుకు కోటి రూపాయలు, సిండికేట్ బ్యాంకుకు రూ. 75 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తి వర్గీకరణ, మోసాలను గుర్తించే నిబంధనలను ఉల్లంఘించినందుకు లక్ష్మి విలాస్ బ్యాంక్ లిమిటెట్కు కోటి రూపాయలు, మోసాల వర్గీకరణ , రిపోర్టింగ్పై ఆర్బిఐ జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు సిండికేట్ బ్యాంక్కు రూ .75 లక్షల జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
