హైదరాబాద్: తాను నిర్వహించనున్న సహస్ర చండీ యాగానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రిని కలిసి ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి కె. తారక రామారావును కూడా శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు. ఖమ్మం జిల్లా నారాయణపురంలోని తన స్వగృహంలో ఈ యాగాన్ని శ్రీనివాస్ రెడ్డి నిర్వహించనున్నారు. ఈ నెల 13 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు ఈ యాగం జరగనుంది. రాష్ట్ర శ్రేయస్సును, రైతులు సహా అన్ని వర్గాల సంక్షేమాన్ని, ప్రకృతి కరుణను ఆకాంక్షిస్తూ ఈ యాగాన్ని శ్రీనివాస్ రెడ్డి నిర్వహించనున్నారు.
