విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. వరద ఉధృతి పెరగడంతో కృష్ణలంక, గాంధీ కాలనీ, తారక రామారావు నగర్ కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
