విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. గాంధీ కాలనీ, తారకరామానగర్, భూపేష్ గుప్తానగర్ కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరుకుంది. లోతట్టు ప్రాంత ప్రజలను కార్పొరేషన్ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముంపు బాధితుల కోసం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. మరో రెండు రోజులపాటు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
