బెంగళూరు: ఉద్యోగులు, అధికారుల బదిలీలలో జోక్యం చేసుకుంటున్నారని సీఎం యడ్యూరప్ప కుమారుడు విజయేంద్రపై బీజేపీ అగ్రనేతలకు సమాచారం చేరడంతో తండ్రీ కొడుకులు అప్రమత్తమయ్యారు. లండన్ నుంచి వచ్చిన రవాణా నిపుణులు బెంగళూరు ట్రాఫిక్పై బీ-ప్యాక్ ఏర్పాటు చేసిన చర్చాగోష్టిలో విజయేంద్ర పాల్గొన్నారు. ఈ విషయమై పార్టీలో చర్చలకు కారణం అవుతుండగా సీఎం యడ్యూరప్ప అప్రమత్తమై విజయేంద్రను బహిరంగంగా కనిపించరాదని, అధికారిక నివాసానికి ఎక్కువగా రాకూడదని సూచించినట్టు తెలుస్తోంది. బీజేవైఎంలో కొనసాగుతున్నందున అదే పదవి ద్వారా పార్టీలో ఎలాంటి కార్యక్రమాల్లో అయిన పాల్గొనవచ్చునని అంతకు మించి ఇతరత్రా వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే విమర్శలు ఎదుర్కొవాల్సి ఉంటుందని మందలించినట్టు తెలుస్తోంది.
