బాలాసోర్: బాలాసోర్ జిల్లా జలేశ్వర్లోని సెక్బాడీ ఏరియాలో ఉన్న ఓ ఇంటిపై ఒడిశా ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 305 గ్రాముల బ్రౌన్ షుగర్ను గుర్తించి సీజ్ చేశారు. మార్కెట్లో దీని విలువ రూ.35 లక్షలుంటుందని అధికారి ఒకరు తెలిపారు. సపన్ ప్రదాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, అతడు నార్కోటిక్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.
