పూణె : నేడు పూణెలో కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ను ఎంజాయ్ చేస్తున్నాడని, టెస్టుల్లో అతనికి మరింత అవకాశం ఇవ్వడం వల్ల భారత్ గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికాతో రెండవ టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ కొన్ని కామెంట్స్ చేశాడు. రోహిత్ లాంటి ప్లేయర్ టాప్ ఆర్డర్లో ఆడితే టెస్టు మ్యాచ్లను ఈజీగా గెలిచేస్తామని కోహ్లీ అన్నాడు. టెస్టుల్లో రోహిత్ రాణించడం సంతోషకర విషయమన్నాడు. రెడ్బాల్ క్రికెట్ను రోహిత్ ఎంజాయ్ చేయనివ్వాలన్నాడు. సఫారీలతో వైజాగ్లో జరిగిన తొలి టెస్టులో రోహిత్ రెండు ఇన్నింగ్స్లో సెంచరీలు చేశాడు. ఆ మ్యాచ్లో భారత్ 203 రన్స్ తేడాతో నెగ్గింది. ఇక రెండవ టెస్టు కెప్టెన్గా కోహ్లీకి 50వ మ్యాచ్ కానున్నది.
"Time to let Rohit Sharma enjoy his batting in red ball cricket" – @imVkohli #TeamIndia #INDvSA pic.twitter.com/px6Nhl1sy0
— BCCI (@BCCI) October 9, 2019
It will be Match No. 50 as Test Captain for @imVkohli when he takes the field in the 2nd Test against South Africa. Congratulations Skip! 👏👏🇮🇳 #TeamIndia #INDvSA pic.twitter.com/Itfw2BiJgG
— BCCI (@BCCI) October 9, 2019