విశాఖపట్నం: ఉత్తర కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దాని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవవచ్చునని అంచనా వేసింది.
