హైదరాబాద్: హైదరాబాద్లోని ఉప్పల్లో శ్రీధ ఆసుపత్రి దగ్గర బైక్ను లారీ ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళుతున్న తాజ్మహల్ కాలనీకి చెందిన మధు(35) మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
