గుంటూరు: అమరావతి రాజధాని నిర్మాణానికి కమిటీ ఏర్పాటుపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. గుంటూరు, విజయవాడ మధ్య ఉన్న మంగళగిరి ప్రాంతం రాజధాని బిల్డింగుల నిర్మాణానికి ఎంతో అనువైన ప్రాంతమని తెలిపారు. గతంలో కూడా అమరావతి నిర్మాణానికి తుళ్లూరు, తాడికొండ దిగువ ప్రాంతంగా ఉండటం వలన అది సరైంది కాదని శ్రీకృష్ణ కమిటీ చెప్పినప్పటికీ చంద్రబాబు బలవంతంగా భూములను లాక్కొని నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. చంద్రబాబు ల్యాండ్ పోలింగ్కు ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని కోరారు. మంగళగిరిలో దాదాపు 10 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఇక్కడ నిర్మాణం జరగాలని కమిటీ సభ్యులను కోరతానని చెప్పారు.
