విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారా (65; 118 బంతుల్లో 11×4, 1×6) అర్ధశతకం సాధించాడు. డ్రింక్స్కు ముందు 61 బంతుల్లో 8 పరుగులు చేసిన అతడు విరామం తర్వాత 14 బంతుల్లో 25 పరుగులు సాధించాడు. వేగంగా ఆడుతూ అర్ధశతకం బాదేశాడు. మరోవైపు రోహిత్ శర్మ (70; 103 బంతుల్లో 5×4, 4×6) నిలకడగా ఆడుతున్నాడు. వీరిద్దరూ 204 బంతుల్లో 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఎక్కువగా బౌండరీలపై దృష్టిపెట్టారు. 42 ఓవర్లకు భారత్ 143/1తో నిలిచింది. 214 పరుగులు ఆధిక్యంతో ఉంది.
