ఇస్లామాబాద్: నవంబర్లో జరిగే కర్తాపూర్ కారిడార్ ప్రారంభోత్సవ వేడుకకు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఆహ్వానించాలని భావిస్తున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మూద్ ఖురేషి చెప్పారు. పంజాబ్ రాష్ట్రం గురుదాస్పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ మందిరంతో కర్తాపూర్ కారిడార్ అనుసంధానం అవుతున్నది. ఎలాంటి వీసాలు లేకుండానే ఇక్కడికి భారతీయ పర్యాటకులకు పాకిస్థాన్ అనుమతిస్తున్నది. భారతీయ సిక్కు పర్యాటకుల కోసం నవంబర్ 9వ తేదీన కర్తాపూర్ కారిడార్ను పాక్ ప్రారంభిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇస్లామాబాద్ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ వేడుకకు మన్మోహన్ సింగ్ను ఆహ్వానించడం సముచిత గౌరవంగా భావిస్తున్నామని, త్వరలోనే ఆయనకు ఆహ్వాన లేఖను పంపుతామని ఖురేషి తెలిపారు. గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తాపూర్కు సిక్కు భక్తుల రాక తమకు ఎంతో సంతోషకరమని వ్యాఖ్యానించారు.
