కరీంనగర్: కాంగ్రెస్పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ, టీఆర్ఎస్ రెండూ తోడు దొంగలేనని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏం చేశారో లక్ష్మణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీకి ఎక్కడా మూడు వేలకు మించి ఓట్లు రావన్నారు. ఎంపీ స్థానాలు గెలవగానే లక్ష్మణ్ అతిగా ఊహించుకుంటున్నారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
