చెన్నై: పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యానికి రక్ష అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ‘స్వచ్ఛభారత్’కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కట్టుబడి ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడులోని మహాబలిపురం పర్యటనలో ఉన్న మోదీ శనివారం తెల్లవారుజామున మామల్లాపురం సముద్రతీరానికి వెళ్లగా అక్కడి బీచ్లో చెత్త కన్పించడంతో స్వచ్ఛభారత్ చేపట్టారు. బీచ్లో ఉన్న చెత్తను స్వయంగా తొలగించారు. దాదాపు అరగంట పాటు మోదీ బీచ్ను శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘మామల్లాపురం బీచ్కు జాగింగ్ వెళ్లిన సమయంలో అక్కడ చెత్తను తొలగించాను. బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచుదాం. మనమంతా ఫిట్గా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం’ అని మోదీ పేర్కొన్నారు.
