హైదరాబాద్: ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో బాక్సాఫీసు వద్ద మెగాస్టార్ చిరంజీవి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి తన 152వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. అయితే తాజాగా దర్శకుడు కొరటాల శివను నటుడు రామ్చరణ్ ఆయన ఆఫీసుకు వెళ్లి కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘అనుకోకుండా కొరటాల శివ కార్యాలయానికి వెళ్లి ఆయన్ని కలిశాను. సినిమా పట్ల ఆయన చూపించే ఉత్సాహం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. చిరు 152 సినిమాకి ఆల్ ది బెస్ట్.’ అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
