రాజేంద్రనగర్: పాచిపోయిన పులిహోరను వినియోగదారులకు అందించిన ఓ హోటల్కు రంగారెడ్డి జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రూ.51 వేల జరిమానాను విధించారు. బండ్లగూడలోని శ్రీకృష్ణ హోటల్ నిర్వహకులు పాడైపోయిన పులిహోరను వినియోగదారులకు అందించారు. ఈ విషయమై వినియోగదారులు మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ రమేశ్కు ఫిర్యాదు చేయడంతో హోటల్ లో తనిఖీలు నిర్వహించారు. పాచిపోయిన పులిహోరతో పాటు ఇతర పదార్థాలను గుర్తించిన అధికారులు హోటల్ నిర్వహకుడికి రూ.51 వేల జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే హోటల్ను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
