న్యూఢిల్లీ: ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. శనివారం లీటర్ పెట్రోల్ పై 10 పైసలు, డీజిల్ పై 15 పైసల మేరకు ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రకటించాయి. ఈ తగ్గుదల తరువాత హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.77.99 కు చేరగా, డీజిల్ ధర రూ.72.47 కు తగ్గింది. అమరావతిలో పెట్రోల్ ధర రూ.77.58 కి, డీజిల్ ధర రూ.71.75 కు చేరింది. విజయవాడలోనూ ధరలు దాదాపు ఇదే విధంగా ఉన్నాయి. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో, నిన్నటితో పోలిస్తే 10 పైసల మేరకు తగ్గిన లీటర్ పెట్రోల్ ధర, ప్రస్తుతం రూ.73.32 కు, 14 పైసలు తగ్గిన డీజిల్ ధర రూ.66.46 కు చేరుకున్నాయి.
