లాక్ డౌన్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కోతపెట్టారు. ఈనెలలో మాత్రం ఉద్యోగులకు పూర్తి వేతనం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, మహారాష్ట్రలో తెలంగాణ కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అంతర్రాష్ట్ర సర్వీసులపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై కూడా ఈరోజు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం …
Read More »సినిమా షూటింగ్లు, థియేటర్స్ ఓపెనింగ్..!
కరోనా ఎఫెక్ట్, లాక్డౌన్తో సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి… థియేటర్లు మూతపడ్డాయి… రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి.. అంతేకాదు… ఎప్పుడు లేని విధంగా బుల్లితెర కార్యక్రమాలు కూడా నిలిచిపోయాయి.. షూటింగ్లు నిలిచిపోవడంతో.. పాత ఎపిసోడ్లను రిపీట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది… అయితే, లాక్డౌన్ నుంచి క్రమంగా సడలింపులు ఇస్తూ ఉండడంతో.. సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభించడం, థియేటర్లను ఓపెన్ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది.. దీనిలో భాగంగా ఇప్పటికే సినీప్రముఖులు …
Read More »కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన మంత్రి…
నిర్మల్: జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే రేఖా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా వ్యవసాయ రుణాల మాఫీ, రైతు బంధుకు నిధులను విడుదల చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. రైతు సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ముందుందన్నారు. రైతుల రాజ్యం రాబోతోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
Read More »మద్యం అమ్మకాలపై నేడు హైకోర్టులో పిల్!…
హైదరాబాద్ : ‘కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్డౌన్ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. రెడ్జోన్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో మద్యం అమ్మకాలే అందుకు నిదర్శనం. దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించాం’ అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తెలిపారు. సోమవారం హైకోర్టులో ప్రభుత్వ తీరుపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నా… …
Read More »విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన కేసీఆర్…
హైదరాబాద్: విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. విశాఖ నగరంలోని ఆర్ఆర్ వెంటకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో భారీ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు కెమికల్ గ్యాస్ లీక్ అయ్యింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర …
Read More »కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ…
హైదరాబాద్ : లాక్డౌన్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కరోనా వ్యాప్తి వంటి అంశాలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ భేటీ ప్రారంభమైంది. కరోనా నియంత్రణ చర్యలు, లాక్డౌన్ పొడిగింపుపై ముఖ్యంగా మంత్రి మండలి చర్చించనుంది. గ్రీన్జోన్లలో మద్యం షాపులు తెరవడంతోపాటు.. మద్యం ధరలను పెంచే విషయాన్ని కేబినెట్ పరిశీలించనుంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నెలాఖరు …
Read More »తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి వల్ల నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. రాష్ట్రం సాధించిన ఐదేళ్లలో అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో ఇతర రాష్ట్రాలకు నమూనాగా మారిందన్నారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మారేడ్పల్లిలోని తన నివాసం వద్దనే పార్టీజెండాలను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి తలసాని …
Read More »తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరించిన కేసీఆర్ …
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు సోమవారం తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం ప్రొ. జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ నేటితో రెండు దశబ్దాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, …
Read More »సేఫ్జోన్గా మహబూబాబాద్…
మహబూబాబాద్: కరోనా కేసులు నమోదు కాకపోవడంతో జిల్లాను అధికారులు సేఫ్జోన్గా ప్రకటించారు. గత 30 రోజులుగా జిల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు ఏమీ నమోదు కాలేదు. మహబూబాబాద్ జిల్లాను ఫ్రీ జోన్గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. నిన్న కేవలం 11 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అన్నీ కూడా హైదరాబాద్లోనే నమోదు అయ్యాయి. కరోనా వ్యాప్తి …
Read More »కేంద్రంపై కలిసి కరోనాపై పోరాడుతున్నాం…
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నేడు ఆయన కేంద్ర మంత్రులు రాజ్నాథ్, కిషన్రెడ్డిలతో కలిసి దేశంలోనే తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ను హైదరాబాద్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంతో కలిసి కరోనాపై పోరాడుతున్నామన్నారు. రాష్ట్రంలో పేదలకు రూ.1500 ఇచ్చామన్నారు. గచ్చిబౌలిలో 20 రోజుల్లో 1500 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశామని కేటీఆర్ వెల్లడించారు. కేంద్రం …
Read More »