విజయవాడ: ప్రతి జిల్లాలో సోషల్ మీడియాపై నిఘా పెట్టామని డీజీపీ సవాంగ్ తెలిపారు. హద్దులు దాటి ప్రవర్తిస్తే కఠినంగా ఉంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో న్యాయస్థానాల మీద కామెంట్స్పై డీజీపీ స్పందించారు. కరోనా సమయంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువైందని, ఆన్ కంట్రోల్గా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారని చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వయస్సుతో సంబంధం ఉండదని, ఏ వయసువారు పెట్టినా నేరంగానే పరిగణిస్తామని ప్రకటించారు. జువైనల్కు …
Read More »నియామీపై దండెత్తిన ఇసుక తుఫాను..
నియామీ : వందల అడుగుల ఎత్తైన ఇసుక తుఫాను నైజీర్ దేశ రాజధాని నియామీపై దండెత్తింది. అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. తుఫాను రాకతో వాతవరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. తుఫాను ప్రభావంతో నగరంలోని కొన్ని ప్రదేశాలు ఎరుపు, ఆరెంజ్ రంగులో దర్శనమిచ్చాయి. అనంతరం నగరం మొత్తం దుమ్మతో నిండిపోయింది. అయితే ఆ వెంటనే వర్షం కురవటంతో పరిస్థితి చక్కబడింది. నియామీలో ఇసుక తుఫాన్లు రావటం కొత్తేమీ కాదు. సహారా …
Read More »సైకిల్పై వచ్చి చిన్నారిని ఈడ్చుకెళ్లిన కోతి
ఇటీవల ఓ కోతి సైకిల్ తొక్కి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి విచిత్ర సంఘటన మరొకటి చోటుచేసుకుంది. సైకిల్పై వచ్చిన ఓ కోతి రెండేళ్ల చిన్నారిని రోడ్డుపై లాక్కెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాళ్లోకి వెళితే.. కొంతమంది చిన్నారులు రోడ్డు పక్కన ఉన్న ఓ బెంచ్పై కూర్చొని ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో సైకిల్పై వేగంగా అక్కడికి వచ్చిన ఓ కోతి.. …
Read More »ఆశ్చర్యం: గాలిపటం ఎగరేస్తున్న కోతి
లాక్డౌన్ కారణంగా రహదారులన్నీ ఖాళీగా దర్శనమివ్వడంతో అడవిలో సంచరించే జంతువులన్నీ రోడ్లపైకి వచ్చి హల్చల్ చేస్తున్నాయి. ఎలాంటి భయం లేకుండా వీధులపై స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇక ఈ సందర్భంగా కోతులు విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణ రోజుల్లోనే కోతులు ఇళ్లలోకి దూరి నానా హంగామా చేస్తుంటాయి. ఇక కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకపోవడంతో వీటికి హద్దే లేకుండా పోతుంది. ఇటీవల ఓ కోతి …
Read More »భావోద్యేగాన్ని కొన్నిసార్లు మాటల్లో చేప్పలేం
హృదయ విదారక దృశ్యం.. ఇంటికి రాగానే అమాంతం ఎత్తుకుని ముద్దాడే తండ్రి డోర్ బయట నుంచే ఫ్లయింగ్ కిస్ ఇస్తుంటే.. తండ్రి దగ్గరికి వెళ్లలేక ఓ చిన్నారి ఏడుస్తున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను మాధుర్ అనే ట్విటర్ యూజర్ బుధవారం షేర్ చేశాడు. ‘ఈ దృశ్యం నా హృదయాన్ని హత్తుకుంది’ అనే క్యాప్షన్తో ట్వీట్ చేసిన ఈ వీడియోకు వేలల్లో వ్యూస్, …
Read More »లాక్డౌన్లో సోషల్ మీడియా అప్!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు లాక్డౌన్ను పాటిస్తుండడంతో సోషల్ మీడియా ఊపందుకుంటోంది. ఫేస్బుక్, ఇన్స్ట్రామ్ కొద్దిగా బలపడగా, లఘు వీడియోల షేరింగ్ ఆప్స్ టిక్టాక్, లీవ్డాట్మీ, బిగో అనూహ్యంగా దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి మార్చి 29వ తేదీ వరకు వీటి ఎదుగుదల గ్రాఫ్ను మార్కెట్ పరిమాణాల విశ్లేషణా సంస్థ ‘కాలాగాటో’ విశ్లేషించి వివరాలను విడుదల చేసింది. యూజర్లు ఎక్కువ సమయాన్ని వెచ్చించే విషయంలో 16 …
Read More »లాక్డౌన్ పొడిగింపును స్వాగతించిన గోవా సీఎం
పనాజీ: కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మోదీ ఇవాళ జాతినుద్ధేశించి ప్రసంగించిన అనంతరం గోవా సీఎం ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘కొవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మే 3 వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. గోవా ప్రభుత్వం …
Read More »మోదీ మాస్క్ ధరించడంపై ప్రశంసల జల్లు
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ మాస్క్తో కనిపించారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. కరోనా ముప్పు దేశానికి ముంచుకొస్తున్న వేళ.. ప్రధాని మోదీ మాస్క్ ధరించి, అందరూ తనలా మాస్క్ ధరించాలని పరోక్షంగా సందేశమిస్తున్నారంటూ నెటిజన్లు పొగుడుతున్నారు. కాగా గతంలో సామాజిక దూరం పాటించాలని చెప్పడమే కాకుండా తానూ దానిని పాటించడం తెలిసిందే.
Read More »లాక్డౌన్ ఉల్లంఘించినందుకు ‘కాళ్ల శిక్ష’…
కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు లాక్డౌన్ అయిపోయాయి. అయినా సరే కొందరు ప్రజలు మాత్రం ఏదొక సాకుతో రోడ్లపైకి విచ్చలవిడిగా వచ్చేస్తున్నారు. ఇలా వచ్చేవారిని పోలీసులు అదుపు చేస్తున్నా.. కొన్ని చోట్ల పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు. అయితే లాక్డౌన్ ఉల్లంఘించినందుకు ఓ దేశంలో బయటకొచ్చిన వారి కాళ్లను బంధించి.. దాదాపు 2 గంటలు రోడ్లపై ఉంచేశారు. ఇప్పుడు ఈ చిత్రమైన శిక్ష సోషల్ మీడియాలో వైరలైంది.
Read More »వాట్సాప్ అడ్మిన్లకు గమనిక…
కరోనాపై తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్లలో హల్చల్ చేస్తోంది. ‘రా.గం.12 నుంచి సోషల్ మీడియాలో కరోనాకు సంబంధించిన ఏ విషయమైనా, వీడియో అయినా షేర్ చేసినా, ఫార్వర్డ్ చేసినా చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని సుప్రీం ఆదేశించింది. గ్రూప్ అడ్మిన్లు ఈ విషయాన్ని గ్రూప్లో తెలియపర్చి, రెండు రోజులు గ్రూప్ను క్లోజ్ చేయాలి’ అనేది వార్త సారాంశం. ఇది ఫేక్ మెసేజ్. ఇలాంటివి నమ్మకండి, ఫార్వర్డ్ చేయకండి.
Read More »