కాలిఫోర్నియా (అమెరికా): కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో సోషల్ మీడియా అయిన ట్విట్టర్ సంచలన ప్రకటన జారీ చేసింది. కరోనా వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా ఇక తమ కంపెనీ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ఫేస్బుక్, గూగుల్ కంపెనీల బాటలో పయనించిన ట్విట్టర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతించింది. ప్రస్థుత కరోనా సంక్షోభం ముగిశాక కూడా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే …
Read More »రాపిడ్టెస్టు కిట్ల దిగుమతిపై వెంకయ్య స్పందన
ఢిల్లీ: కరోనా వ్యాప్తి నివారణ కోసం ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతంగా నిర్వహించేందుకు రాపిడ్ టెస్ట్ కిట్లను ఏపీ ప్రభుత్వం దిగుమతి చేసుకోవడం సంతోషకరమన్నారు. దక్షిణ కొరియా నుంచి లక్ష రాపిడ్ టెస్ట్ కిట్లను ఆంధ్రప్రదేశ్ దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కిట్ల ద్వారా 10 నిమిషాల్లోనే ఫలితాలు వస్తాయని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. వీటి ద్వారా రోజుకు …
Read More »ఆశ్చర్యం: గాలిపటం ఎగరేస్తున్న కోతి
లాక్డౌన్ కారణంగా రహదారులన్నీ ఖాళీగా దర్శనమివ్వడంతో అడవిలో సంచరించే జంతువులన్నీ రోడ్లపైకి వచ్చి హల్చల్ చేస్తున్నాయి. ఎలాంటి భయం లేకుండా వీధులపై స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇక ఈ సందర్భంగా కోతులు విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణ రోజుల్లోనే కోతులు ఇళ్లలోకి దూరి నానా హంగామా చేస్తుంటాయి. ఇక కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకపోవడంతో వీటికి హద్దే లేకుండా పోతుంది. ఇటీవల ఓ కోతి …
Read More »గరిటతో చరణ్.. పైపు పట్టిన చిరంజీవి
హైదరాబాద్: సినిమాల్లో హీరో అవ్వడం కాదు భార్య మనసు దోచుకుని సూపర్ హీరో అనిపించుకున్నారు మెగా పవర్స్టార్ రామ్ చరణ్. తాజాగా రామ్ చరణ్కు లాక్డౌన్ కారణంగా ఇంట్లో ఖాళీ సమయం దొరకడంతో తన సతీమణి ఉపాసన కోసం ప్రత్యేకంగా వంటవండారు. దీనికి సంబంధించి వీడియోను ఉపాసన ట్విటర్లో పోస్ట్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వంట వండటమే కాదు, తర్వాత పాత్రలను కూడా ఆయనే శుభ్రం చేశారు. …
Read More »భావోద్యేగాన్ని కొన్నిసార్లు మాటల్లో చేప్పలేం
హృదయ విదారక దృశ్యం.. ఇంటికి రాగానే అమాంతం ఎత్తుకుని ముద్దాడే తండ్రి డోర్ బయట నుంచే ఫ్లయింగ్ కిస్ ఇస్తుంటే.. తండ్రి దగ్గరికి వెళ్లలేక ఓ చిన్నారి ఏడుస్తున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను మాధుర్ అనే ట్విటర్ యూజర్ బుధవారం షేర్ చేశాడు. ‘ఈ దృశ్యం నా హృదయాన్ని హత్తుకుంది’ అనే క్యాప్షన్తో ట్వీట్ చేసిన ఈ వీడియోకు వేలల్లో వ్యూస్, …
Read More »రూ.100 కోట్ల సాయం.. మోదీ ప్రశంస!
న్యూఢిల్లీ: కలిసి కట్టుగా పోరాడి భారత్ మహమ్మారి కరోనాను తరిమికొడుందని ప్రధానమంత్రి మోదీ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కరోనాపై పోరును మరింత బలోపేతం చేసే విధానం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్స్ తరపున రూ.100 కోట్లు విరాళం అందించిన అవెన్యూ సూపర్ మార్ట్స్ రిటైల్ బ్రాండ్ డీమార్ట్ ప్రమోటర్ రాధాకృష్ణ దామనిని ప్రధాని ప్రశంసించారు. కాగా, బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ పీఎం …
Read More »హోంమంత్రిగా నాది భరోసా: అమిత్ షా
మే 3 వరకు లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు భరోసా ఇచ్చారు. ‘దేశంలో సరిపోయేంత ఆహార నిల్వలున్నాయి. మందులు, నిత్యావసర సరుకుల నిల్వలూ ఉన్నాయి. వాటి గురించి ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. కేంద్ర హోంమంత్రిగా నేను భరోసానిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. దేశంలోని సంపన్నులు పేదలకు సాయం చేయాల్సిన అవసరం వచ్చిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని షా పిలుపునిచ్చారు.
Read More »ఆయన చాలా గొప్ప వ్యక్తి : సెహ్వాగ్
ఢిల్లీ: భారత మాజీ విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు ఘనమైన నివాళి అర్పించాడు. ‘ భారత రాజ్యాంగాన్ని తనదైన శైలిలో చెక్కిన శిల్పి అంబేద్కర్కు ఇవే నా ఘనమైన నివాళి’ అంటూ ట్విటర్ వేదికగా స్పందించాడు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. ‘ బీఆర్ అంబేద్కర్ నిజంగా చాలా గొప్ప వ్యక్తి. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ గొప్పగా పోరాడరని కొనియాడాడు. …
Read More »లాక్డౌన్ పొడిగింపును స్వాగతించిన గోవా సీఎం
పనాజీ: కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మోదీ ఇవాళ జాతినుద్ధేశించి ప్రసంగించిన అనంతరం గోవా సీఎం ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘కొవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మే 3 వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. గోవా ప్రభుత్వం …
Read More »మోదీ ట్వీట్…లాక్డౌన్ను పాటిస్తామంటున్న నెటిజన్లు
ప్రధాని మోదీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్కు ప్రధాని పిలుపునివ్వగా.. చాలామంది ఇళ్లలో నుండి బయటకు వస్తున్నారు. ‘నేను మా అమ్మ కడుపులో 9నెలలు ఉన్నా. మీరిప్పుడు 21రోజులు ఉండలేరా?’ అంటూ చిన్నారి ప్లకార్డు పట్టుకున్నట్లు ఉన్న ఫోటోను మోదీ ట్విట్టర్లో పెట్టాడు. దీంతో నెటిజన్లు మేం ఇంట్లోనే ఉంటామని, భవిష్యత్తు కోసం లాక్డౌన్ను పాటిస్తామంటూ కామెంట్ చేస్తున్నారు.
Read More »