తిరుపతి: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 14 గంటల సమయం, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. దసరా పండుగ సందర్భంగా నిన్న శ్రీవారిని 94,147 మంది దర్శించుకోగా, 29,305 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.20కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. దసరా సెలవులు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివస్తున్నారు.
