హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితకథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం `సైరా`. రామ్చరణ్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం ఈ చిత్రాన్ని ప్రశంసించారు.
తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన కుటుంబంతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. గవర్నర్ కుటుంబం కోసం ప్రసాద్ ల్యాబ్స్లో చిత్రబృందం ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. తన సినిమా `సైరా`ను చూడాల్సిందిగా గవర్నర్ను చిరంజీవి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. చిరు ఆహ్వానం మేరకు గవర్నర్ తన కుటుంబంతో కలిసి `సైరా`ను వీక్షించి చిత్రాన్ని ప్రశంసించారు.