విశాఖ: డిసెంబరు 26, 27 తేదీల్లో విశాఖ ఉత్సవ్ను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు ప్రభుత్వ నుంచి రూ.కోటి మంజూరు చేయనున్నట్లు సమాచారం. విశాఖ ప్రాంత విశిష్టతను తెలియజేసి తద్వారా పర్యాటకానికి ఆకర్షణ తీసుకుచ్చేందుకుగాను ఈ ఉత్పవ్ను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవ్లో స్థానిక కళాకారులకు, క్రీడాకారులకు ప్రాధాన్యత కల్పించనున్నారు. కైలాసగిరిపై ఎంవీఆర్డీఏ ఫ్లవర్ షో, ఎగ్జిబిషన్ స్టాల్స్, కార్నివాల్ ఏర్పాటు చేయనున్నారు. బీచ్రోడ్డు, జాతర, వైఎస్సార్ సెంట్రల్ పార్కులో మూడు వేదికలను ఏర్పాటు చేసి సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
