మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం ధాటికి భారీగా వరద నీరు పోటెత్తిన విషయం తెలిసిందే. మంద్ సార్ జిల్లా నౌగాన్ గ్రామంలో వరద నీటిలో నుంచి వెళ్తూ మహిళ అంతిమయాత్ర చేపట్టారు. గ్రామానికి సమీపంలో ప్రమాదకరంగా ఉన్న నాలాపై నుంచి వరద నీరు పోతున్నా.. వేరే దారి లేకపోవడంతో గ్రామస్థులు నాలాపై నుంచి వెళ్లారు. ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశామని, అయినా తమ గోడును పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.
#WATCH Madhya Pradesh: Residents of Naugaon village in Mandsaur district carry the body of a woman through a flooded nallah, for her last rites. Villagers say that though they had requested the administration multiple times for a bridge, their requests were never heard.(03.10.19) pic.twitter.com/v3AxXQK3UB
— ANI (@ANI) October 3, 2019