ఒడిశా: రైలులో అక్రమంగా బంగారంను తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులను భువనేశ్వర్ డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని జార్సుగూడ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుల వద్ద నుంచి 12.932 కిలోల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.4.99 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
