ఇంటర్నెట్డెస్క్: క్రికెట్లో యోయో టెస్టు ప్రవేశపెట్టినప్పుడు మాజీ సారథి సౌరభ్గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండాల్సిందని టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్సింగ్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా మరికొద్ది రోజుల్లో నియమితమవుతున్న గంగూలీకి యువీ శుభాకాంక్షలు తెలిపాడు. ‘గొప్ప వ్యక్తి ప్రయాణం ఇంకా గొప్పగా ఉంటుంది. భారత జట్టు సారథి నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎదగడం ఎంతో గొప్ప విషయం. ఒక పాలకుడిగా ఆటగాళ్ల దృక్కోణాన్ని ఇతరులకు వివరించే వీలుంటుంది. యోయో పరీక్ష అవసరమైనప్పుడు దాదా ప్రెసిడెంట్గా ఉంటే బాగుండేది’ అని పేర్కొన్నాడు.
యువీ ట్వీట్కు స్పందించిన గంగూలీ అతడిని అత్యుత్తమ క్రికెటర్గా అభిర్ణించాడు. ‘భారత్కు రెండు ప్రపంచకప్లు అందించావు. ఆటకోసం మంచి కార్యక్రమాలు చేపట్టాల్సిన సమయమిది. నువ్వు నా సూపర్స్టార్. ఎల్లప్పుడూ భగవంతుడి ఆశిస్సులు ఉండాలి’ అంటూ బదులిచ్చాడు. కాగా యువరాజ్ జూన్లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల యువీ ఓ మీడియాతో మాట్లాడుతూ తన రిటైర్మెంట్కు గల కారణాలు, యోయో టెస్టు వైఫల్యాన్ని వివరించాడు. తన లాంటి సీనియర్ ఆటగాళ్లను పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన చెందాడు. ఇదిలా ఉండగా రిటైర్మెంట్ తర్వాత యువీ విదేశీ లీగులపై దృష్టిసారించాడు. ఇదివరకు కెనడా గ్లోబల్ లీగ్లో పాల్గొన్న అతడు త్వరలో జరిగే అబుదాబి టీ10 లీగ్లో పాల్గొనే అవకాశముందని ఆ టోర్నీ ఛైర్మన్ షాజీ ఉల్ముల్క్ తాజాగా పేర్కొన్నాడు.